Home / తప్పక చదవాలి
తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.
: కాకినాడ జిల్లా తాళ్ళరేవు లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి యానాం ప్రాంతానికి ఈ ఏడుగురు యువకులు విహార యాత్రకి వచ్చారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
Motkupalli Narsinhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద హైడ్రామా సృష్టించారు. కేసీఆర్ను సమర్థించి తప్పుచేశానని ఆవేదన చెందారు. దళితబంధు అమలు కాకుంటే చస్తానని హెచ్చరించారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. చంద్రబాబును చంపాలని చూస్తున్నారు..(Motkupalli Narsinhulu) ఈ సందర్బంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు(వైఎస్ఆర్ సిపి, బిజెపి, బిఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని […]
:ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కొద్దిరో్జులకిందట తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ పదేళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలుకుతున్నానని ఆమెవెల్లడించారు. ఇలాఉండగా తాజాగా గియాంబ్రునో మహిళా సహోద్యోగులను గ్రూప్ సెక్స్లో పాల్గొనమని కోరిన వీడియోలు బయటకు వచ్చాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల ప్రవాసం తర్వాత శనివారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరుతున్న నేపధ్యంలో షరీఫ్ స్వదేశానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు.