Home / తప్పక చదవాలి
ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లోని ఈశాన్య కిషోర్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో సోమవారం 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.రాజధాని ఢాకాకు 60 కిలోమీటర్ల దూరంలోని కిషోర్గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢాకా వెళ్లే ఎగరోసిందూర్ గోధూలీ ఎక్స్ప్రెస్ వెనుక కోచ్లను ఛటోగ్రాం వైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆంధప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకింది. ఫలితంగా వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయి. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలుగా ఉంది. జరిగిన దాన్ని గమనించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలని మాయం చేసేందుకు ప్రయత్నించారు.
రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఆర్దికసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా, రూ. 44 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, అగ్నివీర్ అందించిన సేవా నిధిలో 30 శాతం, ప్రభుత్వం నుండి సమానమైన సహకారం మరియు విరాళాలపై వడ్డీ ఉన్నాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ సందర్బంగా పలు కీలక అంశాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. కాసేపట్లో జరగబోయే జనసేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో చర్చించబోయే అంశాలని చంద్రబాబుకి లోకేష్ వివరించారు.
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.