Home / తప్పక చదవాలి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని ఆయన కొనియాడారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలోగిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీంతో పార్టీలో పునరుత్తేజం నింపేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ యాత్రలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్వాయిస్ చేసి రూ. 32,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్పై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విదేశాల నుండి విరాళాలు స్వీకరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం పొందింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, అటువంటి విరాళాలను ఢిల్లీలో ఉన్న యొక్క ప్రధాన శాఖలోని ట్రస్ట్ యొక్క నియమించబడిన బ్యాంక్ ఖాతాకు పంపవచ్చు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని కోర్టు సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) నాయకుడు అజం ఖాన్, అతని భార్య తంజీమ్ ఫాతిమా మరియు కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్లను 2019 నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో దోషులుగా నిర్ధారించి వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాలలో 48 విమానాలను రద్దు చేసింది. పీఐఏ ప్రతినిధి రోజువారీ విమానాలకు పరిమిత ఇంధన సరఫరా మరియు కార్యాచరణ సమస్యల కారణంగా విమానాలు రద్దు చేయబడ్డాయి