Published On:

Sabitha Indra Reddy : 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా : మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy : 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా : మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

Former Minister Sabitha Indra Reddy : అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెల్లడించింది. సీబీఐ కోర్టు తీర్పుపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తాజాగా కేసు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. తనను నిర్దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో దాదాపు 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు.

 

అవహేళన చేశారు..
ఏ తప్పు తను చేయలేదని, అయినా ఈ కేసులో తనను దోషిగా చేర్చడంపై బాధపడినట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మినట్లు తెలిపారు. ఈ రోజు అదే జరిగిందని చెప్పారు. కానీ, ఇన్నేండ్లు తను పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు తనను అవినీతపరురాలినని అవహేళన చేశారని తెలిపారు. జైలుకు పోతానని మాటలు అంటుంటే ఎంతో బాధపడ్డానని చెప్పారు. ప్రచారం చేసినా తన జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు తనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. ఎవరెన్ని మాట్లాడినా నమ్మకుండా తనను గెలిపిస్తూ వచ్చారని కొనియాడారు. ఇన్నేండ్లుగా తనతో పాటు ఉండి ధైర్యం చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: