Published On:

South Central Railway: ప్రయాణికులకు స్పెషల్ ట్రైన్స్.. తీర్థయాత్రలకు కొత్త ప్యాకేజీలు!

South Central Railway: ప్రయాణికులకు స్పెషల్ ట్రైన్స్.. తీర్థయాత్రలకు కొత్త ప్యాకేజీలు!

South Central Railway: దేశంలో భారతీయ రైల్వే ఓ పెద్ద నెట్ వర్క్. రైలు ప్రయాణానికి ప్రజలు నుంచి మంచి డిమాండ్ ఉంది. ప్రయాణికుల డిమాండ్ కు తగినట్టుగా రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతూ వారిని ఆకర్షిస్తుంది. సీజన్లు, పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీతో భారత్ గౌరవ్ యాత్ర పేరుతో తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరికొన్ని తీర్థయాత్ర రైళ్లు నడిపేందుకు రైల్వే రెడీ అయింది. హైదరాబాద్ నుంచి రెండు ప్యాకెజీలుగా ఈ రైళ్లను నడపనున్నట్టు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ తెలిపారు. జూన్ 14 నుంచి జూలై 13 వరకు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.

 

గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్యాకేజీ 1లో భాగంగా రైలును నడపనుంది. ఇందులో కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్ రాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించుకోవచ్చు. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై జూన్ 22 వరకు కొనసాగుతుంది. అందుకు టికెట్ ధర స్లీపర్ క్లాస్ రూ. 16,200, థర్డ్ ఏసీ రూ. 26,500, సెకండ్ ఏసీ రూ. 35,000 గా నిర్ణయించారు.

 

ఇక ఐదు జ్యోతిర్లింగాల యాత్ర పేరుతో ప్యాకేజీ 2లో భాగంగా మరో రైలును నడపనుంది రైల్వే. ఇందులో ఉజ్జయిని మహా కాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్పూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. జూలై 5 యాత్ర ప్రారంభమై జూలై 13 వరకు ఉంటుంది. ఇందులో స్లీపర్ టికెట్ ధర రూ. 14,700, థర్డ్ ఏసీ రూ. 22,900, సెకండ్ ఏసీ ధర రూ. 29,900 గా నిర్ణయించారు.

 

కాగా ఈ రైళ్లో ప్రయాణించేవారికి రైలు, బస్సు, హోటల్, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నారు. అలాగే వాటర్ బాటిల్, టూర్ ఎసాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, రైల్వేస్టేషన్ నుంచి ఆలయాలకు ఉచిత ప్రయాణం. కాగా ఈ రైళ్లలో 70 మంది ప్రయాణికులకు ఇద్దరు కోఆర్డినేటర్లు ఉంటారు. కోచ్ కు ఒక సెక్యూరిటీ గార్డు, రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. ఆసక్తిగల ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.