special train: తిరుమల ప్రయాణికులకు కొత్త రైలు.. చర్లపల్లి నుంచి స్టార్ట్

SCR: వేసవి సెలవుల కారణంగా తిరుమల వెళ్తున్న వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్టు ప్రకటించింది. కాగా వేసవి సెలవులు, శుభకార్యాలు, పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కానీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో బెర్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జనరల్ కోచ్ లో ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారు.
దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ నడపాలని నిర్ణయించింది. ఈ రైలు మే 8 నుంచి మే 30వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
రైలు నెం. 07257 చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్లే రైలు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుంది. ఇక రైలు నెం. 07258 తిరుపతి నుంచి చర్లపల్లికి రావల్సిన రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరుతుంది.
ఈ రైలు సనత్ నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిర్, కృష్ణా, రాయ్ చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూర్, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగుప్రయాణంలో ఆయా స్టేషన్లలో ఆగుతుంది.