Home / ప్రాంతీయం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో
తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు 8గంటల 30 నిమిషాలలో చేరుకోనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా.. 27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. కాగా ఈ క్రమం లోనే చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది కోర్టు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా ఈ క్రమం లోనే ఈరోజు కూడా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ అసెంబ్లీ స్పీకర్
బుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా ? లేకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని కాని తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా కట్టలేదని రాజాసింగ్ ఆరోపించారు.