Home / ప్రాంతీయం
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనం దీనిని మరో బెంచ్ వద్దకు బదిలీ చేసింది. ధర్మాసనం లోని జడ్జి ఎస్వీ భట్టి ఈ కేసు విచారణకు విముఖత చూపారు.
అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్ని కూడా నిందితుడిగా చేర్చారు.
హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందుకు గాను హైదరాబాద్,
తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి..
స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి
చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీల సమస్య అన్నారు. హైదరాబాద్లో ఆందోళనలకు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ నోరు అదుపులోకి పెట్టుకోకుంటే పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీపై మూకదాడి జరగడం ఖాయమని హెచ్చరించారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు