Last Updated:

Janasena chief Pawan Kalyan: సామూహిక అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.

Janasena chief Pawan Kalyan: సామూహిక అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..  జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan: సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.

గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాలి..(Janasena chief Pawan Kalyan)

అమ్మానాన్న లేని ఆ బాలిక తన తమ్ముడితో కలసి జీవిస్తుంటే.. నలుగురు మృగాళ్ళు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చ అని పవన్ మండిపడ్డారు. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి  గంజాయి మత్తులో తూగుతూ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాల్ని సంరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో.. గంజాయి ముఠాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నామని చెప్పారు. ఈ నగరానికీ, తెలంగాణకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో కూడా పత్రిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయని.. గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాల్సిన అవసరం ఉందని అన్నారు.. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయగలమని పవన్ కళ్యాణ్ చెప్పారు.