Home / క్రైమ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్ధరాత్రి కాల్పుల మోత మోగింది. గ్రామంలో రవాణా శాఖ ఆఫీస్ ఎదుట ఫైనాన్స్ వ్యాపారి ఆదిత్మ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ఎవరో చొరబడడంతో ఆదిత్య వారిని నిలదీశాడు.
టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటినుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత అదంతా రికార్డు
సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఎంఐఎం నేత కషఫ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై జాతీయ నేర గణాంక సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో. తెలంగాణలో క్రైం రేటు భారీగా పెరిగిందని.. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది.
విశాఖ బీచ్లో గల్లంతై.. నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు గాను, కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు" ఉన్నాయని పోస్ట్మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.
మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పైతర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నివసిస్తున్న లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.