Home / క్రైమ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కారు బాంబు దాడి జరిగిందంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిన్నట్లు జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని ఒక కార్మికుడు యజమాని తనకు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ కోటి రూపాయల మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టాడు. రణ్వీర్ అనే కార్మికుడు ఒక ఇంట్లో టైల్స్ అమర్చాడు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పలు బహుమతులు, నగదు ఇచ్చాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నటీమణులు పేర్లు వెలుగులోకి వచ్చాయి.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
హైదరాబాద్ లో ఏదో ఒక మూలన నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చి.. ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాతబస్తీలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పెట్టే పోస్టులపై పోలీసులు పెద్దగానే దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులపై మాత్రం ఉదాశీనత. ఈ క్రమంలో భాజాపా పార్టీ నేతపై హైదరాబాదు పోలీసులు విద్వేష పూరిత కేసు నమోదు చేశారు.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు, , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది.