Home / క్రైమ్
స్పైస్జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్సింగ్ పై గురుగ్రామ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తకు కోట్లాది షేర్లను మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. విమానయాన రంగానికి చెందిన కన్సెల్టెంట్ అమిత్ అరోరా తను చేసిన సేవలకు గాను 10 లక్షల విలువ చేసే షేర్లు, నకిలి డిపాజిటరీ ఇన్స్ర్టక్షన్ స్లిప్స్అందజేశారు.
లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.