Last Updated:

Anand Mahindra: మండే మోటివేషన్.. నెట్టింట వైరల్ గా మారిన మహింద్ర చీఫ్ పోస్ట్

నేటి సమాజంలో నెట్టింట వైరల్ అవుతున్న ఎన్నో విషయాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. సమాజంలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అలాంటి ప్రేరణలను షేర్ చేసే వ్యక్తుల్లో ఒకరు మహింద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్ర.

Anand Mahindra: మండే మోటివేషన్.. నెట్టింట వైరల్ గా మారిన మహింద్ర చీఫ్ పోస్ట్

Viral Post: నేటి సమాజంలో నెట్టింట వైరల్ అవుతున్న ఎన్నో విషయాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. సమాజంలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అలాంటి ప్రేరణలను షేర్ చేసే వ్యక్తుల్లో ఒకరు మహింద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్ర. ఆయన తాజాగా రామకృష్న పరమహంస యోగానంద్ చేసిన ఓ స్పూర్తిదాయక కొటేషన్ ను మండే మోటివేషన్ అనే వ్యాఖ్యంతో తనదైన శైలిలో ట్విటర్ లో పోస్టు చేశారు.

వారం ఆరంభంలో అందరిలో జోష్ నింపుతోంది. మీరు విచారంగా ఉండాల‌నుకుంటే ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రూ మిమ్మ‌ల్ని సంతోష‌పెట్ట‌లేరు. కానీ మీరు మీ మ‌న‌సును సంతోషంతో నింపుకుంటే మీలోని ఆనందాన్ని ఈ ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రూ దూరం చేయ‌లేర‌ని కోట్ అర్ధాన్ని పేర్కొన్నారు.

వారంలో తొలిరోజు చికాకుల‌ను పార‌దోలేందుకు శాశ్వ‌త ప‌రిష్కారం. మండే మోటివేష‌న్ అని ఈ పోస్ట్‌కు మహింద్ర అధినేత క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ పోస్ట్ ప‌లువురు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంది. స్ఫూర్తి నింపే పోస్ట్ ఇదేనంటూ ఓ యూజ‌ర్ రాసుకురాగా, అద్భుతం. స్ఫూర్తిదాయ‌క‌మైన వ్యాఖ్య అంటే ఇదేన‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్స్ సెక్ష‌న్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Culvert collapsed: కుప్పకూలిన కల్వర్టు.. క్షేమంగా బయటపడ్డ జనం.. యుపిలో ఘటన

 

ఇవి కూడా చదవండి: