Home /Author anantharao b
రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఆర్దికసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా, రూ. 44 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, అగ్నివీర్ అందించిన సేవా నిధిలో 30 శాతం, ప్రభుత్వం నుండి సమానమైన సహకారం మరియు విరాళాలపై వడ్డీ ఉన్నాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ సందర్బంగా పలు కీలక అంశాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. కాసేపట్లో జరగబోయే జనసేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో చర్చించబోయే అంశాలని చంద్రబాబుకి లోకేష్ వివరించారు.
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం.., మనం చేద్దాం జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
ఇంధన సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో దెబ్బతిన్న గాజా ఆసుపత్రులలోని ఇంక్యుబేటర్లలో 120 నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ పిల్లల ఏజెన్సీ ఆదివారం హెచ్చరించింది. ఇంధనం లేకపోవడం వల్ల ఈ శిశువులు చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.