Home / ys sharmila
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కాంగ్రెస్లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్తో షర్మిల చర్చించారు.
తమ పార్టీ విలీనంపై కాంగ్రెస్తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్కి చెందిన మనిషని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికేనని రేవంత్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఈ ఉదయం బెంగుళూరులో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె అన్నారు. అనంతరం మహానేత వైఎస్సార్తో ఉన్న సాన్నిహిత్యాన్ని శివకుమార్ గుర్తు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల చేసినవి అపరిపక్వ వ్యాఖ్యలని ఆర్జీవీ అన్నారు. సునీత పేరుతో ఆస్తులున్నాయి కాబట్టి హత్యకి ఆమె ఎలా సహకరిస్తారని షర్మిల ప్రశ్నించడం సరికాదని ఆర్జీవీ తప్పుబట్టారు
YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు.
YS Sharmila: రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలు మితీమీరిపోతున్నాయని.. వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో.. అరెస్టైన విషయం తెలిసిందే.