Home / Vijay Devarakonda
హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. అయితే విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు విజయ్ మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని రౌడీ బాయ్ వ్యాఖ్యానించారు.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.
దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన కాజోల్ నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే మళ్ళీ రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి, అయితే ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా పై నెట్టింట అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్న క్రమంలో విజయ్ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ఈ మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. కాగా ఈ సినిమా విడుదలయిన ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. దానితో విజయ్ దేవరకొండ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది.
జనగణమన చిత్రం గురించి మర్చిపోండి అంటూ సైమా వేదికగా విజయ్ దేవకరకొండ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా నెటిజన్లు ఇంక జనగణమన ఆగిపోయినట్టేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిలో నిజానిజాలేంటో తెలియాలంటే పూరీ నోరువిప్పాల్సిందే.