Home / Tollywood News
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.
చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ ప్రేక్షకులను పరిచయమైన కావ్య, హీరోయిన్ గా అడుగు పెట్టబోతుంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా 'మసూద'. ఈ సినిమా హార్రర్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కధా నాయకుల నడుమ విభన్న కధలతో, సాహస చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్ జాగర్లమూడి మరో భారీ సినిమా హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ వర్క్ షాపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
మొగల్తూరులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా మొగల్తూరులో ప్రభాస్ అభిమానులే కనిపిస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభా కార్యక్రమాలు జరిగాయి.
వైవిధ్యమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కైవసం చేసుకున్న హీరో నవీన్ చంద్ర. ఈ నటుడు తాజాగా నటిస్తున్న మూవీ మంత్ ఆఫ్ మధు. కాగా మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్ను నేడు విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్కు మంచి రెస్పాన్స్ లభించింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. బ్యూటీ క్వీన్ గా స్వీటీకి అభిమానుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే నాలుగు పదుల వయస్సు దాటుతున్నా ఆమె ఇంతవరకూ పెళ్లాడలేదు. మరి ఆమె పెళ్లాడకపోవడానికి అనేక కారణాలుండొచ్చు కానీ స్వీటీ అభిమానులు మాత్రం అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా స్వీటీ పెళ్లిచేసుకోబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
12 ఏళ్ల తర్వాత హీరో ప్రభాస్ మొగల్తూరికి వచ్చారు. చాలా సంత్సరాల తర్వాత ప్రభాస్ సొంతూరికి రావడంతో ఆ ప్రాంతమంతా డార్లింగ్ ఫ్యాన్స్ తో సందడిగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కృష్ణం రాజు సంస్మరణ సభ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొన్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.
ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది కానీ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం బుధవారం అనగా 28సెప్టెంబర్ 2022న ఘనంగా అనంతపురంలో జరిగింది. మరి ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.
ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో కనిపించినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.