Home / Telangana
2023లో అసెంబ్లీ, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తెరాస పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్ స్కీం గడువు రేపటితో ముగియనుంది.
మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు.
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది.