Home / Telangana
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
దేశలోని ప్రజలందరికి అరచేతిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకురావడమే డిజిటల్ బ్యాంకుల ఏర్పాటు ఉద్ధేశంగా కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకుల్లో మూడు బ్యాంకులను తెలంగాణాలో ఏర్పాటు చేశారు.
ప్రజల మన్ననలు పొందేందులో తెలంగాణ ఆర్టీసి వెనుకబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ తీరు కూడా ఉండడంతో రాష్ట్రంలో పలు డిపోల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ జోన్ పరిధిలో రెండు ఆర్టీసీ డిపోలను మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ , 2022లో 121 దేశాలలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్కు పడిపోయింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.