Home / Telangana News
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు .
బండి సంజయ్ మూడో విడత పాద యాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్గా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
బండి సంజయ్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు | BJP Bandi Sanjay Prajasangrama Yarta | Prime9 News
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలను అగష్టు 26 న ప్రకటించనున్నారు. బీఈడీ విద్యార్థుల ప్రవేశ పరీక్షల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఎడ్సెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన తరువాత https://edcet.tsche.ac.in/ వెబ్సైట్ ద్వారా ఎడ్సెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశం పై చర్చించారు.
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని ...అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.