Home / Prime Minister Modi
ఈ ఏడాది చివరిలో భారత్ లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ మరియు దీపావళి వేడుకలను వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరియు ఆస్ట్రేలియా అభిమానులను ఆహ్వానించారు. అక్టోబర్-నవంబర్లో భారత్లో క్రికెట్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి జరుపుకోనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి పలు రంగాల్లో సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా "ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో సత్కరించారు.దీనిని ఫిజీ అధ్యక్షుడు సితివేని రబుకా ప్రధాని మోదీకి అందించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 19) తన ఆరు రోజుల పర్యటన కోసం మూడు దేశాలైన జపాన్, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాకు బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
తాను చదువుతున్న పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఒక బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రారంభించింది.సీరత్ నాజ్ అనే 3వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తన పాఠశాల పరిస్థితిని పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియోను రికార్డ్ చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఖాకీ ప్యాంటు, స్లీవ్లెస్ జాకెట్ ధరించి కనిపించారు. నల్లటి టోపీ ధరించి బైనాక్యులర్స్ చేతబట్టి టైగర్ రిజర్వ్ ను పరిశీలించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి పులుల అభయారణ్యాలలో ఒకటిగా ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయన.
: ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానిని ప్రతి అంశంలో నిలదీశానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీబీఐ వజ్రోత్సవ వేడుకలను దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. అలాగే షిల్లాంగ్, పూనే, నాగ్పూర్లో కొత్తగా నిర్మించిన సీబీఐ భవనాలలకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.దేశం యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ నిలిపివేయబడింది