Home / Prime Minister Modi
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ చానల్ వారంలోపే 5 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. తన ఫాలోవర్లందరికీ కృతజ్జతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదివారం ప్రారంభించారు.మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిదాన్ సదన్ ( రాజ్యాంగ సభ) గా పిలవబడుతుందని చెప్పారు. పార్లమెంటు కొత్త భవనంలోకి మారేందుకు ముందుగా సెంట్రల్ హాల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంయుక్త సమావేశం జరిగింది.
సెప్టెంబర్ 18-22 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తొమ్మిది అంశాలను జాబితా చేసిన సోనియా రాబోయే సెషన్లో వాటిపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రధానిని కోరారు.
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
కాంగ్రెస్కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.ఢిల్లీ మెట్రోలో ప్రధాని దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు