Home / Narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్లో ఓటు వేశారు. గుజరాత్ ఎన్నికలరెండవ దశ పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పోలింగ్ బూత్కు వెళుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ క్యూలో నిలబడి ఓటు వేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ 'సంకల్ప్ పత్ర' లేదా 'మేనిఫెస్టో'ని విడుదల చేసారు.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సంబంధించి బీజేపీ మరో వీడియో విడుదల చేసింది. రాత్రి 8 గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారని ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ను కలుసుకున్నారని ఇది సత్యేందర్ దర్బార్ అంటూ పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 71,000 మంది నియామక లేఖలను కొత్త రిక్రూట్మెంట్లకు పంపిణీ చేశారని మరియు వారిని ఉద్దేశించి ప్రసంగించారని ఆయన కార్యాలయం తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ దక్షిణభారత దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను బెంగళూరులో జెండా ఊపి ప్రారంభించారు . నేడు ఆయనరూ. 25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
గుజరాత్ రాష్ట్రాన్ని దేశ రక్షణ కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ కీలక అడుగులు వేశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు ప్రధాని శంకుస్ధాపనం చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. దీని తర్వాత అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానాలోని మోధేరా నుంచి నేడు ప్రధాని తన పర్యటనను ప్రారంభించనున్నారు.
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.