Home / Manipur
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మంగళవారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పి) హోల్డర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన సిస్టమ్ ఇన్నర్ లైన్ పర్మిట్ కౌంటర్లలో చెల్లుబాటు గడువు ముగిసిన వారిని సమర్థవంతంగా తనిఖీ చేయడంలో సహాయపడుతుందని అన్నారు.
మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లా న్యూ లమ్కాలో శుక్రవారంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిన వేదికను గుంపు ధ్వంసం చేసి, తగులబెట్టడంతో సమావేశాలు నిషేధించబడ్డాయి.మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.