Home / Manipur
మణిపూర్లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.
:మణిపూర్లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది.
మణిపూర్లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్ను పొడిగించింది.
మణిపూర్లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో కూడిన అంబులెన్స్ను ఒక గుంపు దారిలో పెట్టి తగలబెట్టడంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు అతని తల్లి మరియు మరొక బంధువుతో సహా మరణించాడని అధికారులు తెలిపారు.
మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మొదట మే 3న విధించిన నిషేధం ఇప్పుడు జూన్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు మరో ఐదు రోజుల పాటు అమలులో ఉంటుంది.
మణిపూర్లో దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను హెచ్చరించిన తరువాత, శుక్రవారం 140కి పైగా ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. ఆయుధాల కోసం త్వరలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు.
మణిపూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో త్రిపుర కేడర్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి రాజీవ్ సింగ్ మణిపూర్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులయ్యారు
మణిపూర్కు చెందిన పదకొండు మంది క్రీడా ప్రముఖుల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపింది. సంతకం చేసిన వారిలో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కూడా ఉన్నారు.
ఆదివారం మణిపూర్లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలు మరియు పౌరులపై కాల్పులు జరిపిన సందర్భాల్లో ఒక పోలీసుతో సహా కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు భారత సైన్యం కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ప్రారంభమైంది.