Home / latest Telangana news
మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాసినో, వన్యప్రాణుల పెంపకంతో వార్తల్లో కెక్కిన చీకోటి ప్రవీణ్ రాజా సింగ్ ను కలిసారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైనముగ్గురు నిందితులను సిట్ బృందం విచారిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. పార్టీ పేరును "భారత్ రాష్ట్ర సమితి" గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రధానమంత్రి మోదీ అండ్ టీం పై ఆరోపణలు గుప్పిస్తూ ఎమ్మెల్యేల కొనుగోల ప్రలోభాల డీల్ కేసుపై సీఎం కేసిఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.