Home / latest Telangana news
హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ నోరు అదుపులోకి పెట్టుకోకుంటే పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీపై మూకదాడి జరగడం ఖాయమని హెచ్చరించారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరిని తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై అంగీకరించలేదు.
ముఖ్యమంత్రి కేసిఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని, ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఇతర అంశాలపై ఆయనతో సీనియర్లు చర్చించనున్నారు. ఇప్పటికే మైనంపల్లి ఇంటికి దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేరుకున్నారు.
మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది.
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో
తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు 8గంటల 30 నిమిషాలలో చేరుకోనుంది.
బుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా ? లేకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని కాని తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా కట్టలేదని రాజాసింగ్ ఆరోపించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు పెద్దగా స్పందించలేదు. అయితే తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తమిళ హీరో విశాల్ కూడా చేరారు.
హైదరాబాద్లో నగరంలో ప్రసిద్ది గాంచిన హోటల్ లలో ఆల్ఫా హోటల్ గురించి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్కు నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. టీ, కాఫీ లతో పాటు బిర్యానీ వరకు అన్ని ఇక్కడ లభిస్తాయి. అయితే అనూహ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 17 వ తేదీన ఈ హోటల్ ను సీజ్ చేశారు.