Home / latest Telangana news
తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
: హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా అలయ్ బలయ్ వేడుక ఘనంగా జరుగుతోంది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం సాగుతోంది.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
వరంగల్ లో విషాదకర ఘటన జరిగింది. దసరా పండగను పురస్కారించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. ఊహించని ఈ ఘటనలో ఓ యువతి, ఆమె తండ్రి మరణించగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కిష్టాపురం
తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.
Motkupalli Narsinhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద హైడ్రామా సృష్టించారు. కేసీఆర్ను సమర్థించి తప్పుచేశానని ఆవేదన చెందారు. దళితబంధు అమలు కాకుంటే చస్తానని హెచ్చరించారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. చంద్రబాబును చంపాలని చూస్తున్నారు..(Motkupalli Narsinhulu) ఈ సందర్బంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు(వైఎస్ఆర్ సిపి, బిజెపి, బిఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని […]
తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.