Home / latest Telangana news
దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 లో రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని అన్నారు .
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముస్లిం రిజ్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా గురువారం నాడు తెలంగాణలోని సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. దీనికి బదులుగా ఎస్సీ, ఎస్టిలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు.
బీజేపీపై నయవంచన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. గురు వారం గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 40కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని..గొప్పులు చెప్పే బీజేపీ ఏ ఒక్క పేదవారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా వేయకుండా మోసం చేసిందని అన్నారు .
పీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ హెచ్ సి ఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది .ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి .. ఆధ్వర్యంలో ధర్నాచేసారు.
తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
పతినే ప్రత్యక్ష దైవంగా భావించిన భార్య భర్త చనిపోయిన తర్వాత గుడి కట్టిన సంఘటన ఆసక్తిగా మారింది .మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ,సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది . పిల్లలు కలగ లేదు.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయింది. ఈనెల 30, వచ్చేనెల మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు . ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభకి మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సభకి నరేంద్ర మోదీ హాజరవుతారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణత శాతం 60.01 కాగా 12వ తరగతిలో 64.19 గాఉంది.
బీఆర్ఎస్, కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చివేసారు. . ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ బదిలీ చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.