Home / latest sports news
టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లైన బుమ్రా, జడేజాలతో పాటు స్టాండ్ బై ప్రేయర్గా ఉన్న దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్లేయర్ అయిన రిషభ్ పంత్ కు గాయమైనట్టు తెలుస్తోంది.
భారత పురుషుల జట్టు సాధించలేని విజయాన్ని మహిళల జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీ20 ఆసియాకప్ను తన సొంతం చేసుకుంది హర్మన్ సేన. సిల్హౌట్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో మహిళల భారత జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనే బౌలర్లను డిసైడ్ చేసింది. ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో 16 జట్ల తలపడనుండగా.. ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేస్తూ ఒక జాబితా విడుదల చేసింది. మరి వారెవరో చూసెయ్యండి.
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్రకెక్కింది.
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
క్రికెట్ మ్యాచుల్లో గాయాలు కామన్. కాగా బ్యాటర్ల బాదుడు ధాటికి ఒక్కోసారి వికీలు, ఫీల్డర్లు, అంపైర్లు గాయపడుతుంటారు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ ఊపుడు దెబ్బకి లెగ్ అంపైర్ క్షతగాత్రుడు అయ్యాడు.
టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.
ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీం ఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.