Home / latest sports news
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయ విజయం సాధించిన టీం ఇండియా టీ20 ప్రపంచకప్లో ఘనంగా శుభారంభం చేసింది. కాగా నేడు నెదెర్లాండ్స్ సిడ్నీ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్కు రెడీ అయింది.
టీ20 వరల్డ్ కప్ ప్రయాణంలో టీం ఇండియా విజయారంభం చేసింది. పాకిస్థాన్పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫుడ్ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత జట్టు సమరం ప్రారంభమయ్యింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు భారత్ ముచ్చమటలు పట్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది పాక్.
టీ20 వరల్డ్ కప్ 2022 పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది. సూపర్-12 రౌండ్ మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభం అవనున్నాయి. గత ఏడాది టీ 20 ప్రపంచ కప్లో ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ఈ రౌండ్ ప్రారంభమవుతుంది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. నేడు జరిగిన కీలకమైన క్వాలిఫయర్స్ మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీనితో ఈ టోర్నీలో కరేబియన్ల కథ ముగిసిపోయి ఇంటి ముఖం పట్టారు.
క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు స్లో ఓవర్ రేట్ పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆసిస్ జట్టు ఓ సరికొత్త ప్లాన్ అమలుచేసింది. మరి అదేంటో తెలుసుకుందాం.
ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్ను బాదాడు.
ప్రస్తుత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే కొనసాగడానికి తమ మద్దతు ఉంటుందని ఈ విషయంలో సౌరవ్ గంగూలీ పేరును ప్రతిపాదించమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) స్పష్టం చేసింది