Home / latest sports news
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20కి ముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్ను భారత్ గెలవలేదని అన్నాడు.