Home / latest national news
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసన నుంచి సాక్షి మాలిక్ విరమించుకున్నారు. ఆమె ఉత్తర రైల్వేలో తన ఉద్యోగంలో తిరిగి చేరింది. రెజ్లర్లు శనివారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో లంపి చర్మవ్యాధి ( ఎల్ఎస్డి) కలకలం రేపుతోంది. లంపి స్కిన్ డిసీజ్ అనేది ఆవులు మరియు గేదెలలో ఒక అంటు వ్యాధి. ఇది పశువుల మరణాల రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఇప్పటివరకు మొత్తం 571 జంతు మరణాలు నమోదయ్యాయి.
32 ఏళ్ల నాటి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీని ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ 1991లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు అవదేశ్ రాయ్ ను హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
సోమవారం తెల్లవారుజామున ఒడిశాలోని డుంగురి నుంచి బార్గఢ్కు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు బార్ఘర్ జిల్లా సంబర్ధరా సమీపంలో పట్టాలు తప్పాయి. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ప్రతినిధి బృందం శనివారం హోంమంత్రి అమిత్ షాతో రాజధానిలోని ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తమ నిరసన గురించి మాట్లాడేందుకు ఒలింపిక్స్లో పాల్గొన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు
ఒడిసా బాలాసోర్ ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది.
Bridge Collapse: ఎంతో ప్రతిష్టాత్మకంగా గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కానీ ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.275 మంది ప్రాణాలను బలిగొన్న, 1,000 మందికి పైగా గాయపడిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశామని వైష్ణవ్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులతో అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో గురువారం కొత్తగా పెళ్లయిన జంట వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం మరణించిన సంఘటన సంచలనం కలిగించింది. వధూవరులు గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనకు 'ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు' కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల క్రితం 'వ్యవస్థలో తీవ్రమైన లోపాలు' గురించి హెచ్చరించారు.