Home / latest national news
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా తన రెండు మొబైల్ ఫోన్లను తన నివాసానికి ప్రక్కనే ఉన్న చెరువులోకి విసిరేసారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తన ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో తన మొబైల్ ఫోన్లను చెరువులో విసిరారు
బీహార్లోని మోతీహరిలోని తుర్కౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించి కనీసం 14 మంది మరణించారు. అయితే మరణాలపై పరిపాలన యంత్రాంగం స్పందించలేదు. వీటికి అతిసారం కారణంగా పేర్కొంది
ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల నుండి కొన్ని అంశాలు మరియు భాగాలను తొలగించాలనే నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది, ప్రతిపక్షాలు కేంద్రం ప్రతీకారంతో వైట్వాష్ చేస్తోందని ఆరోపించాయి.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) లేదా సెంట్రల్ పారామిలిటరీ బలగాలలో కానిస్టేబుల్స్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది
జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధాని మోదీపై సంచనల వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రికి అవినీతితో సమస్యలేదని తాను చెప్పగలనని అన్నారు. ది వైర్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూణె లోని పింపుల్ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఈరోజు తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ విషాద ఘటనలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
Covid Cases: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు కూడా రోజురోజుకు బాగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు కంటే 9 శాతం అధికంగా కేసులు నమోదు అయినట్టు తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు దగ్గరైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 49,622 గా ఉన్నాయి. కొవిడ్ కారణంగా మరో […]
నాలుగో దశ క్యాన్సర్కు శస్త్రచికిత్స సమయంలో 90 శాతం నాలుకను తొలగించినప్పటికీ, బ్రిటిష్ మహిళ మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. జెమ్మా వీక్స్ (37) అనే మహిళ గత ఆరేళ్లుగా తన నాలుకతో సమస్యలు ఉన్నాయని చెప్పారు.
దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ బుధవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుతో మహారాష్ట్రలోని కోర్టును ఆశ్రయించారు.లండన్లో తన ప్రసంగంలో సావర్కర్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్తో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.