Home / latest national news
గత నెలలో రామనవమి వేడుకల సందర్భంగా హౌరాలోని షిబ్పూర్లో జరిగిన హింసాకాండపై ఎన్ఐఏ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. రామనవమి ఊరేగింపుల సందర్బంగా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ మరియు హౌరా జిల్లాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే
మూడు దశాబ్దాల నాటి ఐఏఎస్ అధికారి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలు నుంచి వాకౌట్ చేశారు. అతడిని గురువారం తెల్లవారుజామున విడుదల చేశారు.
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.
ఒక మనిషికి ఎంతమంది భార్యలు ఉండవచ్చు? ఐదు, పది, పదిహేను? బీహార్ కుల గణన సమయంలో వెల్లడైన సమాచారంలో రూప్చంద్ అనే వ్యక్తి 40 మంది మహిళలకు భర్త అని తేలింది.అయితే ఇలా ఎందుకు ఉందనే దానిపై పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ మైసూరులోని ఐకానిక్ మైలారీ హోటల్లో ఉదయం అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆమె అక్కడ కొంతమంది కస్టమర్లతో కూడా సంభాషించారు.
: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసం సుందరీకరణ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనం దేశ రాజధానిలో రాజకీయ దుమారం రేపింది.ఈ నివేదికపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విపక్షాలు- కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా మండిపడ్డారు.
శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ మృతి చెందారు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈయన తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. కాగా 95 ఏళ్ల వయసున్న ప్రకాష్ సింగ్ గతంలో 5 సార్లు పంజాబ్ సీఎం గా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా గత వారమే ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్కు సంబంధించి లక్నో పోలీసులు మంగళవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రియురాలి తండ్రిపై విసుగు చెందిన ఓ ప్రేమికుడు చేసిన పనేనని ఇప్పుడు తేలింది.
పులుల నిర్వహణను శాస్తీయంగా చేసే ప్రయత్నంలో భాగంగా సుందర్బన్ టైగర్ రిజర్వ్ (STR) జోన్తో మరో మూడు అటవీ శ్రేణులను విలీనం చేసే అవకాశం ఉంది. అటవీ శాఖ అధికారుల ప్రకారం, ఈ జంతువుల ఆవాసాలను రక్షించడం మరియు వాటి సంరక్షణను ప్రోత్సహించడం ఈ విస్తరణ లక్ష్యం.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై విరుచుకుపడ్డారు.తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కాకపోతే, ఆయన మెరిట్ ఆధారంగా ఈ దేశంలో ఏ ఉద్యోగం వచ్చేది కాదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.