Home / latest national news
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
తమిళనాడు, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రభుత్వాలకు పెద్ద ఊరటగా, ఎద్దులను మచ్చిక చేసుకునే సంప్రదాయ క్రీడ జల్లికట్టు' మరియు ఎద్దుల బండి పందేల చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.
ముంబై యొక్క వడ పావ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తాజాగా భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాను తొలిసారి మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే తనకు వడపావ్ వడ్డించి తినేలా చేసారని వ్యాఖ్యానించారు.
తనకు కొడుకు కావాలని అందువలన జైలులో ఉన్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళ అధికారులను అభ్యర్దించింది. గత ఏడేళ్లుగా గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న భర్త పెరోల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది.
నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
కర్నాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఏకమై మోదీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలోనే దేశ ప్రజలు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిఉంటుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డికె శివకుమార్ కంటే ముందున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు సీఎం పదవి కోసం మద్దతిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై విచారణకు సంబంధించి ఇండియా ఎహెడ్ న్యూస్ యొక్క వాణిజ్య అధిపతి మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ అరవింద్ కుమార్ సింగ్ ను సీబీఐ అరెస్టు చేసింది.గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంస్థకు హవాలా మార్గాల ద్వారా రూ. 17 కోట్లు బదిలీ చేశారన్న ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఒడిశాలోని గోపీనాథ్పూర్లోని గోపీనాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ఓ దొంగ 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చాడు. వీటిని దేవాలయం వద్ద వదిలిపెట్టిన దొంగ తన పేరును చెప్పకుండా ఒక లేఖ కూడా రాసాడు.