Home / Karnataka
కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప మసీదుల్లో ఇచ్చే అజాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆజాన్ సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తేనే మాత్రమే అల్లా ప్రార్థనలు వింటారా అని ప్రశ్నించారు. జేపీ 'విజయ్ సంకల్ప్ యాత్ర'లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈశ్వరప్ప ఆజాన్ను తలనొప్పిగా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
Bride: కొద్ది రోజుల్లో పెళ్లి.. పెళ్లవ్వగానే అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కోసం వేసుకున్న మేకప్ పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. అందంగా ఉండాలని ప్రయత్నించి చివరికి.. ఆసుపత్రిపాలైంది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
Karnataka MLA: కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
కర్ణాటకలోని కెఆర్ పురం మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపై దుండగులు రాళ్లు రువ్వడంతో మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కిటికీలు దెబ్బతిన్నాయి
Bengaluru Court: కర్ణాటక కేడర్ మహిళా అధికారుల రగడ చివరికి కోర్టుకు చేరింది. ఐఏఎస్ ఆఫీసర్ రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని ఐజీపీ రూపా డి. మౌద్గిల్కు బెంగళూరు 74 వ సిటీ సివిల్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రూప వివరణ ఇవ్వాలి: కోర్టు( Bengaluru Court) రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని […]
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడంతో వారిద్దరిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు