Home / Karnataka
Jagadish Shettar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఆదివారం ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకత్వం తనను అవమానించిందని ఆరోపించిన ఆయన, స్వతంత్రంగా పోరాడాలా లేక పార్టీతో కలిసి పోరాడాలా అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
:కర్ణాటక రాష్ట్రంలో అమూల్ ప్రవేశం రాజకీయ వేడిని రగిలించింది. స్థానిక ప్రఖ్యాత పాల బ్రాండ్ నందిని ని రక్షించుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. ఒక పధకం ప్రకారం ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను దెబ్బతీసేందుకే అమూల్ ను తీసుకు వచ్చిందంటూ ఆరోపిస్తున్నాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రంలో మే 10న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మే 14న వెలువడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
Yediyurappa Home: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. యడ్యూరప్ప ఇంటి వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటి దగ్గర భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న సన్నివేశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ నిర్ణయమే కారణమా..(Yediyurappa Home) షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న […]
కర్ణాటక ఎన్నికలకు ముందు టిప్పు సుల్తాన్కు సంబంధించిన మరో అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. టిప్పు సుల్తాన్ హంతకులపై సినిమా నిర్మించేందుకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్సిసి)తో చర్చలు జరుపుతున్నట్లు అధికార బీజేపీ ప్రకటించింది
కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప మసీదుల్లో ఇచ్చే అజాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆజాన్ సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తేనే మాత్రమే అల్లా ప్రార్థనలు వింటారా అని ప్రశ్నించారు. జేపీ 'విజయ్ సంకల్ప్ యాత్ర'లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈశ్వరప్ప ఆజాన్ను తలనొప్పిగా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.