Home / heavy rains
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేపాల్లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ వివరించింది.
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
:యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ను వరదలు ఒక పట్టాన వదిలేట్టు కనిపించడం లేదు. గత నెల దుబాయిలో గత 70 ఏళ్లలో ఎన్నడూ కురవని విధంగా భారీ వర్షాలు దుబాయిని అతలాకుతలం చేశాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం మరో మారు అబుదబితో పాటు దుబాయిని భారీ వర్షాలు ముంచెత్తాయి.
కాంగోలోని కసాయి-సెంట్రల్ ప్రావిన్స్లో వరదలతో 22 మంది మరణించారు, అక్కడ కుండపోత వర్షాలు మౌలిక సదుపాయాలను నాశనం చేసి వరదలకు కారణమయ్యాయని కనంగా పట్టణ అధికారులు తెలిపారు.కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు, చర్చిలు మరియు రోడ్లు ధ్వసం అయి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.