Home / Elon Musk
డబ్బులు ఊరికే రావు అన్న మాటను ఇప్పుడు మస్క కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉచితం కాదు. బ్లూ టిక్ పొందడం కోసం నెలకు 8 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.660 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు దాఖలు చేసిన కంపెనీ సమాచారం ప్రకారం, ఎలోన్ మస్క్ సోమవారం ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి, తనను తాను ఏకైక సభ్యునిగా ప్రకటించుకున్నారు
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి పని పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త సామాజిక మాధ్యమ వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేసినట్టు సమాచారం.
ఇకపై ట్విటర్ లో సినిమాలు, గేమ్స్ నెట్టింట హల్ చేయనున్నాయి. ఆ దిశగా ట్విటర్ అధినేత ఎలన్ మాస్క్ పావులు కదుపుతున్నారు. మరో వైపు ఇప్పటివరకు ఉన్న ట్విటర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీని కూడా మార్పులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఎలన్ మస్క్ చేసుకొన్నట్లు తెలుస్తుంది.
ట్విట్టర్ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను ఎట్టకేలకు సొంతచేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల అనంతరం డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేశారు. అయితే ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరాగానే మస్క్ తనను తప్పుదారి పట్టించాడని ఆరోపించిన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ను మరియు టాప్ ఎగ్జిక్యూటివ్లను బాధ్యతల నుంచి తప్పించారు.
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులు లేఖ వ్రాశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే 75శాతం ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పునారోలోచించాలని సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు మస్క్ కు లేఖ వ్రాశారు.
ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ సేవలను పలు విధాలుగా వినియోగించుకుని ఉన్నాం. కాగా త్వరలోనే దేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందనున్నాము. ఎలన్ మస్క్ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.