Home / China
: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, మార్చి మధ్యలో చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ యొక్క మొదటి కేసు నమోదయింది. 56 ఏళ్ల మహిళ పక్షులలో కనిపించే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా యొక్కవ్యాధి బారిన పడి చైనాలో మరణించిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం.
అరుణాచల్ ప్రదేశ్పై తన వాదనను చెప్పే ప్రయత్నంలో, చైనా అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రదేశాలకు మూడవ సెట్ పేర్లతో ముందుకు వచ్చింది, దీనిని "జంగ్నాన్, టిబెట్ యొక్క దక్షిణ భాగం" అని పేర్కొంది.
Jack Ma: దాదాపు గత మూడేళ్లుగా చాలా అరుదుగా బయట కనిపిస్తున్న చైనాకు చెందిన కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన తాజాగా చైనాలో అడుగుపెట్టారు. చైనా హాంగ్ జా లో తాను స్థాపించిన స్కూల్కు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి. జాక్ మా రాకతో హాంకాంగ్ మార్కెట్లో అలీబాబా షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అలీబాబా గ్రూప్ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్మా.. […]
చైనాలో యాంటీవైరల్ ఫ్లూ ఔషధాల ఆన్లైన్ అమ్మకాలు ఏడాది క్రితం కంటే 100 రెట్లు పెరిగాయి. చైనా ఆధారిత ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు టావోబావోలో మార్చి మొదటి 13 రోజుల్లో ఒసెల్టామివిర్ అనే జెనెరిక్ పేరుతో విక్రయించబడుతున్న ఈ ఔషధం అమ్మకాల పరిమాణం దాదాపు 533,100 యూనిట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది.
స్మార్ట్ఫోన్ల ద్వారా స్పై, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలకు వీరిని కూర్చోబెట్టి పెన్షన్లు ఇవ్వడం తలకు మించిన భారంగా భావిస్తోంది. ఫ్రాన్స్లో మెక్రాన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 నుంచి 64కు పెంచింది.
మూడు సంవత్సరాల తరువాత విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. మార్చి 15 నుండి వివిధ రకాల వీసాల జారీని పునఃప్రారంభిస్తామని తెలిపింది. కోవిడ్ నేపధ్యంలో గత మూడేళ్లుగా విదేశీ పర్యాటకులను చైనా అనుమతించలేదు.
సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలను పునఃప్రారంభించేందుకు, ఇరు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఏడేళ్ల ఉద్రిక్తతల తర్వాత, చైనా సహాయంతో ఇరు దేశాలు ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
:చైనీస్ దౌత్యవేత్తలు తమ దేశాన్ని రక్షించుకోవడానికి తోడేళ్ళతో డ్యాన్స్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. తన తొలి వార్షిక మీడియా సమావేశంలో విదేశాంగ విధానం మరియు యుఎస్-చైనా సంబంధాల గురించి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, క్విన్ గ్యాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తైవాన్ "మొదటి రెడ్ లైన్" అని యునైటెడ్ స్టేట్స్ చైనా-యుఎస్ సంబంధాలను దాటకుండా ఉండాలి అని అన్నారు.