Home / AP Politics
ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరింది. ఈ పథకంలో భాగంగా విద్యార్ధులకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు.
Vidya Deevena: పేద విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జగన్ జమ చేశారు.
వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతుంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ మేరకు తాజాగా వచ్చిన ఫలితాలు వైకాపాకి ఊహించని షాక్ ఇచ్చాయి. పట్టభద్రులు అధికార పార్టీకి అనుకోని రీతిలో ఓటమిని కట్టబెట్టారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీ వెళ్ళిన సీఎం జగన్ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ పొలిటీషియన్గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు.
Janasena Formation Day: జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు.