Home / Ap latest news
విశాఖలో పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నేను పవన్ తో మాట్లాడాలి, తనను పరామర్శించాలి అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పేర్నినాని ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో 175 స్ధానాల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెడితే ప్యాకేజీ స్టార్ అనే మాటలను వెనక్కి తీసుకుంటామని పేర్ని నాని సవాల్ విసిరారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా వైసీపీ నేతలను బండబూతులు తిట్టాడు. విశాఖ జిల్లాలో జరిగిన జనసేనాని పర్యటనలో జరిగిన అనేక అవమానాల నేపథ్యంలో ఆయన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఎదుట చాలా ఆగ్రహావేశానికి గురయ్యారు. చవట సన్నాసుల్లారా, దద్దమ్మళ్లారా నేను తిట్టలేను అనుకుంటున్నారా అంటూ చెప్పు చూపిస్తూ అధికార పార్టీ నాయకులపై వీరలెవెల్లో మండిపడ్డారు.
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. విపక్షనేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.