Home / Ap latest news
ఏపీలోని రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
"మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్ల హస్తం ఉండడం వల్లే ఈ కేసు ముందుకు వెళ్లడం లేద"ని వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆరోపించారు.
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగిపోతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగింది.
ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.
రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ జెండా ఎవరెస్ట్ పై రెపరెపలాడింది. అదెలా అనుకుంటున్నారా, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 80 ఏళ్ల వృద్ధుడు అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే అక్కడి వరకూ వెళ్లి తాను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. మరి ఆ విషయాలేంటో చూసేయ్యండి.
పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నేన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.