Home / పొలిటికల్ వార్తలు
విశాఖ గర్జన ముగించుకొని మంత్రులు, వైసీపీ నేతలు విశాఖ నుంచి తిరుగుపయనమవుతున్న టైంలో ఎయిర్పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకొనింది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోలన్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్నా ర్యాలీలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా భాజపా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు
ప్రకృతి సహజ సిద్ధమైన రుషికొండను, నేటి ప్రభుత్వం బోడి కొండగా మార్చిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మట్లాడారు.
3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. పదే పదే విశాఖ రాజధానిగా ఉండాలంటూ అమరావతి రాజధాని పై రగడ చేస్తున్న వైకాపా శ్రేణులు నోరెళ్లబెట్టేలా జనసేన పార్టీ లేఖాస్త్రం సంధించింది