Last Updated:

MVV Satyanarayana: విశాఖ గర్జనకు, వైకాపాకు సంబంధం లేదు.. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ

3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు.

MVV Satyanarayana: విశాఖ గర్జనకు, వైకాపాకు సంబంధం లేదు.. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ

Visakhapatnam: 3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు. దీని పై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ ఓ క్లారిటీ ఇచ్చారు. గర్జనకు, వైకాపాకు సంబంధం లేదని, జేఏసి నేతృత్వంలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని మీడియాతో పేర్కొన్నారు. అయితే జేఏసీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు. ఏ పార్టీలు మద్ధుతు ఇస్తున్నాయన్న వివరాలను ఆయన తెలుపలేదు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 6నెలల కొకసారి వస్తారు. తర్వాత వెళ్లిపోతారు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పవన్ జనవాణి కార్యక్రమం, విశాఖ గర్జన కార్యక్రమాలు వేరు వేరన్నారు. జేఏసి ఆధ్వర్యంలో రేపటిదినం గర్జన నిర్వహిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ

ఇవి కూడా చదవండి: