Home / పొలిటికల్ వార్తలు
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమపై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకధల మంత్రి అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారని సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్పై బుధవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కళ్యాణదుర్గం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ బుధవారం పార్టీ రాజస్థాన్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.
తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది