EPFO Interest Rate Fixed: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం!

Centre has finalized the EPF interest Rate 8.25 Percent: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్నిరోజుల కింద ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే వడ్డీని చెల్లించిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.
బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
-పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం ఉమాంగ్ యాప్ను సందర్శించొచ్చు. రిజస్టర్డ్ ఫోన్ నంబర్తో లాగిన్ అయిన తర్వాత యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆపై బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు కనిపిస్తాయి.
-EPFO పోర్టల్ www.epfindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లి UAN, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెంబర్ పాస్బుక్ను ఎంపిక చేసుకుని వివరాలు పొందొచ్చు.
-మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి 9966044425 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కాసేపటికి పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది.
-మెస్సేజ్ రూపంలో వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి 7738299899 నంబర్కు EPFOHO ‘UAN’ అని మెసేజ్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ పొందొచ్చు.