Last Updated:

Rajasthan Bandh: కర్ణి సేన చీఫ్ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్‌ బంద్

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన మరియు ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్‌లో తమ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణిసేన డిమాండ్ చేసింది.సత్వర చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని మద్దతుదారులు హెచ్చరించారు.

Rajasthan Bandh: కర్ణి సేన చీఫ్ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్‌ బంద్

Rajasthan Bandh:రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన మరియు ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్‌లో తమ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణిసేన డిమాండ్ చేసింది.సత్వర చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని మద్దతుదారులు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్త బంద్ ప్రకటించిన నేపథ్యంలో, జైపూర్ పోలీసులు శాంతి మరియు సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలని మరియు పుకార్లు లేదా నకిలీ వార్తలను విస్మరించమని పౌరులను కోరారు. తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదని, తప్పుడు వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసు అధికారులు తమ తమ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర మరియు జిల్లా సరిహద్దులు మరియు కీలక ప్రదేశాలలో సమర్థవంతమైన చెక్‌పోస్టులను అమలు చేయాలని మరియు అల్లర్ల నియంత్రణ యంత్రాంగాలను సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నిందితుల గుర్తింపు..(Rajasthan Bandh)

ఇలాఉండగా గోగమేడిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మొదటి నిందితుడిని రోహిత్ రాథోడ్, మక్రానా నాగౌర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రెండో నిందితుడిని హర్యానాలోని మహేంద్రగత్‌కు చెందిన నితిన్ ఫౌజీగా గుర్తించారు.సీసీటీవీ ఫుటేజీలో వీరు తమకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్న గోగమేడిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం కనిపించింది పారిపోయే ముందు నిందితుల్లో ఒకరు కదలకుండా నేలపై పడుకున్న గోగమేడిని సమీపం నుంచి కాల్చారు.