Home / జాతీయం
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
పంజాబ్లోని అమృత్సర్లో శివసేన నాయకుడు సుధీర్ సూరిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలు తగలడంతో సూరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంపై క్రికెటర్ శిఖర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు
విధి వారి జీవితాలతో ఆటలాడుకొనింది. చల్లదనాన్ని అందించే ఆ వస్తువే వారి ప్రాణాలు బలిగొంటుందని తెలిసేలోపే విగతజీవులైనారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకొనింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటినుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో లోపాన్ని బహిర్గతం చేస్తూ తాము ప్రయోజనాలను పొందుతామని ఒవైసీ అన్నారు.
అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఏ గవర్నర్ కైనా అన్ని హక్కులు ఉంటాయని, అంతమాత్రాన వారిని రాజీనామా చేయాలని కోరడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు.
అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.