Home / జాతీయం
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ స్థానంలో నిపుణుడిని తీసుకురావాలని ఆలోచిస్తోంది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారందరీ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
నేటి సమాజంలో పబ్ కల్చర్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆడమగ వయసు వ్యత్యాసం లేకుండా తెగతాగేస్తున్నారు. తాగేసి గుట్టుచప్పుకుకాకుండా కొందరు ఉంటే మరికొందరు ఆ మైకంలో వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా రోడ్డుపై నానా రచ్చ చేస్తుంటారు. ఈ కోవకు చెందినదే ఈ వీడియో మరి ఆ ఘటన ఏంటి ఎక్కడ జరిగిందో ఓ సారి చూసెయ్యండి.
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
కర్ణాటకలోని చిక్కమగళూరులోని కొప్పాకు చెందిన ఔత్సాహిక ఉపాధ్యాయురాలు గత ఆదివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అడ్మిషన్ టికెట్లో సన్నీ లియోన్ ఫోటో ఉండటంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.
భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకొనింది. 62వ రోజు పాదయాత్ర లో భాగంగా నాందేడ్ జిల్లా అట్కాలి గ్రామంలో జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే పాదయాత్రలో కుప్పకూలి మరణించారు.
పచ్చని పల్లెలు కనుమరుగౌతున్నాయి. నగరాలు శరవేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామీకరణ కారణంగా దేశంలోని చిన్న నగరాలను కాలుష్యం చిదిమేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాలుష్యం కోరల్లో చిక్కిందని పదే పదే వింటుంటాం. కాని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది.